అంబేద్కర్ భవన్లో బూత్ లెవల్ ఏజెంట్లకు అవగాహన సమావేశం:
హనుమకొండ నగరంలోని అంబేద్కర్ భవన్ లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్స్ కోసం ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగల వెంకట్రామ్ రెడ్డి పాల్గొని ఏజెంట్లకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎన్నికల అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు.

ఓటర్ల జాబితా సవరణపై దిశా నిర్దేశం:
సమావేశంలో ఇనగల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి BLA బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలకు కచ్చితంగా పాటిస్తూ గ్రామస్థాయిలో ఓటర్ల వివరాలను సేకరించాలని చెప్పారు. ప్రతి ఏజెంట్ తమ పరిధిలోని బూతు లెవెల్ ఆఫీసర్ ని వెంటనే కలుసుకొని కాంగ్రెస్ పార్టీ BLA గా పరిచయం చేసుకోవాలని సూచించారు.

లింక్ కానీ ఓటర్ల పై ప్రత్యేక దృష్టి:
2025 ఓటర్ల జాబితాను 2002 జాబితాతో అనుసంధానం చేసే ప్రక్రియలో లింక్ కానీ ఓటర్ల వివరాలను గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. లింక్ అయిన ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారం అందుతుందని లింక్ కాని వారు తగిన గుర్తింపు పత్రాలతో ఫారం నింపాల్సి ఉంటుందని వివరించారు. ముఖ్యంగా 18 నుంచి 43 ఏళ్ల మధ్య వయసు గల ఓటర్ల కుటుంబ వివరాలను సేకరించాలని సూచించారు.

ముందస్తు సన్నాహాలు చేయాలని సూచన:
వలస వెళ్లిన ఓటర్ల పాత నియోజకవర్గం ఇంటి నెంబర్, పాత ఓటర్ ఐడి వివరాలను సేకరిస్తే మ్యాపింగ్ సులభం అవుతుందని తెలిపారు. పార్టీ మద్దతుదారుల ఆధార్ కార్డ్, పాత ఓటర్ ఐడి, పుట్టిన తేదీ, ధ్రువీకరణ పత్రాలను ముందుగానే సిద్ధం చేయాలని కోరారు, ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందే ఎక్కువ మంది ఓటర్లను లింక్ చేసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు భారీ సంఖ్యలో బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


