రాష్ట్రంలో వ్యవసాయాధారిత అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు, వరి ధాన్యం సేకరణ ప్రక్రియపై ముఖ్యమంత్రి కీలక దిశానిర్దేశం చేశారు.
రైతుల నుండి వరి ధాన్యం, మొక్కజొన్న సేకరించడంలో ఎదురవుతున్న ఇబ్బందులు, కొనుగోలు కేంద్రాల పనితీరుపై సీఎం సమీక్షించారు. సేకరణ ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడాలని,రైతులకు మద్దతు ధర అందేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేరుగా పాల్గొన్నారు. వీరితో పాటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి (రామకృష్ణారావు), ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, సీతక్కతో పాటు వివిధ జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.


