రాష్ట్రంలోని ఉపసర్పంచుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపసర్పంచుల సంఘం ఆధ్వర్యంలో హనుమకొండలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపసర్పంచులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల బలోపేతానికి తాము నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ ప్రభుత్వం తమ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపసర్పంచులకు గౌరవ వేతనం పెంపు, అధికారిక గుర్తింపు, గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో తగిన అధికారాల కల్పన వంటి డిమాండ్లను వెంటనే అమలు చేయాలని కోరారు.
గ్రామస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారంలో ఉపసర్పంచులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ తమ హక్కులు, అధికారాలు, సంక్షేమంపై ప్రభుత్వం సరైన దృష్టి సారించడం లేదని విమర్శించారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


