HomeWarangal Newsభావితరాల కోసం హరిత సంకల్పం.. పర్యావరణ పరిరక్షణపై సీపీ కీలక పిలుపు

భావితరాల కోసం హరిత సంకల్పం.. పర్యావరణ పరిరక్షణపై సీపీ కీలక పిలుపు

Published on

spot_img


భావితరాల కోసం హరిత సంకల్పం.. పర్యావరణ పరిరక్షణపై సీపీ కీలక పిలుపు :

వరంగల్: పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని.. భవిష్యత్తు తరాలకు కాలుష్యరహిత వాతావరణం అందించాలంటే ఇప్పటినుంచి ప్రతి ఒక్కరు చొరవ తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అధికారులు సిబ్బందితో కలిసి పండ్ల మొక్కలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “ప్రపంచవ్యాప్తంగా అటవీ సంపద క్రమంగా తగ్గిపోవడం, పట్టణీకరణ వేగంగా పెరగడం , పచ్చదనం స్థానంలో కాంక్రీట్ నిర్మాణాలు విస్తరించడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని పేర్కొన్నారు. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం కూడా ప్రకృతి పై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు”.

పర్యావరణ మార్పులు కారణంగా వర్షపాతం సరైన సమయంలో లేకపోవడం, ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వంటి పరిణామాలు ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయని ఆయన వివరించారు. ఈ పరిస్థితులను అధిగమించాలంటే మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని పెంచే బాధ్యత తీసుకుంటే పర్యావరణ పరిరక్షణకు పెద్ద ఎత్తున తోడ్పాటు అందించినట్లు అవుతుందని సిపి పేర్కొన్నారు. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని అన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఆర్‌ఐలు తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Latest articles

ఐఫోన్‌లో కొత్త శకం.. ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది!

యాపిల్ ఎట్టకేలకు ఫోల్డబుల్ ఐఫోన్‌ను లాంచ్ చేసి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. కొత్త డిజైన్, ఫోల్డింగ్ డిస్‌ప్లే, అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ ఐఫోన్‌పై టెక్ ప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

నందు బిగ్ బాస్‌లోకి వస్తే..నాగార్జునకు కొత్త తలనొప్పి తప్పదా?

బిగ్ బాస్ తెలుగు 10లో నందు ఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నందు హౌస్‌లోకి వస్తే హోస్ట్ నాగార్జునకు కొత్త తలనొప్పులు తప్పవా? ఆమెకు సంబంధించిన వివాదాలు షోపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు: నేడు 22A నిషేధిత భూములపై చర్చ

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నాలుగో రోజు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో ప్రధానంగా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోని సెక్షన్ 22ఆ అంశంపై ఉభయ సభల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘమైన, వాడీవేడి చర్చ జరగనుంది.
spot_img

Related Articles

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఇసుక ట్రాక్టర్ – ఆటో ఢీ: ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పర్వతగిరి మండల పరిధిలోని అన్నారం గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక ఇసుక ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

హనుమకొండలో భారీ అగ్నిప్రమాదం: హోటల్ యజమాని దుర్మరణం, భార్య పరిస్థితి విషమం

హనుమకొండ జిల్లా పరిధిలోని అదాలత్ జంక్షన్ వద్ద ఉన్న ప్రముఖ 'లింగాల కేదారి హోటల్'లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.