HomeWarangal Newsగిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు కొట్టిన మైనారిటీ గురుకుల విద్యార్థిని

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు కొట్టిన మైనారిటీ గురుకుల విద్యార్థిని

Published on

spot_img

వరంగల్: తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థిని మ‌హ‌మ్మ‌ద్ అసియా ఇటీవ‌ల చెన్నైలో జ‌రిగిన కరాటే పోటీలో గిన్నిస్ వరల్డ్‌ రికార్డు సొంతం చేసుకున్న విష‌యం తెలియ‌డంతో రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమ‌తి కొండా సురేఖ, త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శుక్ర‌వారం స‌దరు హ‌న్మ‌కొండ మైనారిటీ విద్యా సంస్థ‌కు వెళ్ళి అసియాను అభినందించారు.

ఈ సంద‌ర్భంగా గిన్నిస్ వరల్డ్‌ రికార్డు ప‌త్రాన్ని అసియా, మంత్రి సురేఖ‌కు చూపించి వివ‌రాలు తెలిపారు.

త‌మిళ‌నాడులోని చెన్నై అక్టోబర్ 5వ తారీఖున జ‌రిగిన కరాటే పోటీ ప్ర‌ద‌ర్శ‌న‌లో సుమారు మూడు వేల మంది క‌రాటే ఛాంపియ‌న్లతో 17 మంది స‌మ‌న్వ‌యక‌ర్త‌ల మ‌ధ్య కేవ‌లం 863 మంది మాత్ర‌మే క్వాలిఫై అయిన‌ట్టు తెలిపారు.

అయితే, తెలంగాణకు సంబంధించిన అసియా మైనారిటీ గురుకుల విద్యా సంస్థ‌లో చ‌దువుతుండ‌టం విశేశమ‌ని మంత్రి సురేఖ అభిప్రాయ‌ప‌డ్డారు. భ‌విష్య‌త్తులో మ‌రింత శిఖ‌రాల‌కు వెళ్లాల‌ని ఆశీర్వ‌దించారు.

ఈ కార్యక్రమం లో 23వ డివిజన్ మాజి కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ పాల్గొన్నారు

Latest articles

ఐఫోన్‌లో కొత్త శకం.. ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది!

యాపిల్ ఎట్టకేలకు ఫోల్డబుల్ ఐఫోన్‌ను లాంచ్ చేసి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. కొత్త డిజైన్, ఫోల్డింగ్ డిస్‌ప్లే, అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ ఐఫోన్‌పై టెక్ ప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

నందు బిగ్ బాస్‌లోకి వస్తే..నాగార్జునకు కొత్త తలనొప్పి తప్పదా?

బిగ్ బాస్ తెలుగు 10లో నందు ఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నందు హౌస్‌లోకి వస్తే హోస్ట్ నాగార్జునకు కొత్త తలనొప్పులు తప్పవా? ఆమెకు సంబంధించిన వివాదాలు షోపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు: నేడు 22A నిషేధిత భూములపై చర్చ

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నాలుగో రోజు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో ప్రధానంగా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోని సెక్షన్ 22ఆ అంశంపై ఉభయ సభల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘమైన, వాడీవేడి చర్చ జరగనుంది.
spot_img

Related Articles

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఇసుక ట్రాక్టర్ – ఆటో ఢీ: ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పర్వతగిరి మండల పరిధిలోని అన్నారం గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక ఇసుక ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

హనుమకొండలో భారీ అగ్నిప్రమాదం: హోటల్ యజమాని దుర్మరణం, భార్య పరిస్థితి విషమం

హనుమకొండ జిల్లా పరిధిలోని అదాలత్ జంక్షన్ వద్ద ఉన్న ప్రముఖ 'లింగాల కేదారి హోటల్'లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.