గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) కౌన్సిల్ సమావేశం మేయర్ గుండా సుధారాణి అధ్యక్షతన కౌన్సిల్ హాల్లో ప్రారంభమైంది. ఈ సమావేశంలో కమిషనర్ చాహత్ వాజ్పేయి, అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన 2026-27 ఆర్థిక సంవత్సరానికి సుమారు ₹1,047 కోట్ల బడ్జెట్ అంచనాలు ప్రతిపాదించారు. నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, పారిశుధ్యం, తాగునీరు, రోడ్ల అభివృద్ధి వంటి అంశాలపై ఈ బడ్జెట్లో ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం.
సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత సమస్యలు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చలు కొనసాగుతున్నాయి. నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్పొరేటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


