హన్మకొండ: గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఆరెపల్లి ఎస్బీఐ బ్యాంకు సమీపంలో జాతీయ రహదారి (NH 163) పై శుక్రవారం ఉదయం ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్-2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద తీవ్రతకు వాహనదారుడు తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఆగ్రహించిన స్థానికులు బస్సును అడ్డుకుని రోడ్డుపై నిలిపివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


