హన్మకొండ: ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లాలో పర్యావరణ చైతన్య కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్కి ఒక అందమైన ప్రకృతి చిత్రాన్ని (Nature Painting) బహుకరించారు.
పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, భావి తరాల కోసం అడవులను రక్షించాలని కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జిల్లా అటవీ శాఖ అధికారి భుక్యా లావణ్య నాయక్, సొసైటీ అధ్యక్షుడు ఇందారం నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్ శర్మ, పర్యావరణవేత్త పిట్టల రవిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అడవుల ప్రాముఖ్యతను తెలియజేస్తూ, వన్యప్రాణుల రక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.


