HomeWarangal Newsహన్మకొండ | ఇందిరమ్మ ఇళ్ల సమస్యలు పరిష్కరించండి : కడియం శ్రీహరి

హన్మకొండ | ఇందిరమ్మ ఇళ్ల సమస్యలు పరిష్కరించండి : కడియం శ్రీహరి

Published on

spot_img

హన్మకొండ: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించేలా హౌసింగ్ ఎండీ మరియు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర గృహనిర్మాణ మరియు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి గారు అభ్యర్థించారు.

హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రజల నుండి విశేష స్పందన వస్తోందని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్లలో జనగామ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, జనగామ జిల్లాలోనూ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ముందంజలో ఉందని తెలిపారు.

“స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి మంజూరు చేసిన 3,500 ఇళ్లలో 3,400 ఇళ్లు గ్రౌండింగ్ పూర్తయ్యాయి” అని ఆయన వెల్లడించారు.

ఈ పథకం అమలులో కొన్ని సాంకేతిక మరియు పరిపాలనా సమస్యలు ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని మంత్రి గారిని కోరారు.

ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు పొందినవారు బేస్ మెంట్ స్థాయికి నిర్మాణం పూర్తి చేసినప్పటికీ బిల్లులు ఆపివేశారన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, లబ్ధిదారులకు వెంటనే బిల్లులు చెల్లించాలని సూచించారు.

అలాగే నిర్మాణం చేపట్టని లబ్ధిదారుల స్థానంలో కొత్త వారికి ఇళ్లు మంజూరు చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన అభ్యర్థించారు.

అనంతరం ధర్మసాగర్ మండలం దేవునూరు గుట్ట ప్రాంతంలో పట్టా రైతులు ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆయన ప్రస్తావించారు.

ఫారెస్ట్ మరియు రెవెన్యూ శాఖలు ఇప్పటికే జాయింట్ సర్వే నిర్వహించి రిపోర్టు సమర్పించినప్పటికీ సమస్య ఇంకా పరిష్కారం కాలేదన్నారు.

న్యాయపరంగా హక్కు ఉన్న రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన మంత్రి గారిని కోరారు.

అలాగే దేవునూరు గుట్ట మరియు ధర్మసాగర్ రిజర్వాయర్‌లను కలిపి ఎకో టూరిజం హబ్‌గా అభివృద్ధి చేసేందుకు వాటిని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (KUDA) పరిధిలోకి చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సూచించారు.

Latest articles

బ్రేక్‌ఫాస్ట్‌ లో ఈ ఫుడ్స్ తింటే కడుపు నిండుగా.. ఆరోగ్యం పదిలం!

ఉదయం అల్పాహారం రోజంతా శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండే సమతుల్యమైన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఎక్కువసేపు ఎనర్జీగా ఉండొచ్చు.

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి
spot_img

Related Articles

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...