IPL 2026 ఫైనల్పై వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకపోతే ట్రోఫీ ఎవరిది?
ఐపీఎల్ 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. మే 31న జరగనున్న గ్రాండ్ ఫైనల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా వర్షం అంశం ఇప్పుడు చర్చనీ అంశంగా మారింది.
ఫైనల్ కు వర్షం అడ్డొస్తే ఏం జరుగుతుంది?
ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫైనల్ మ్యాచ్ కి ప్రత్యేకంగా రిజర్వ్ డే ఉంటుంది. ఒకవేళ మే 31న వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోతే.. జూన్ 1 అదే స్థితి నుంచి ఆటను కొనసాగిస్తారు. రిజర్వ్ డే రోజున కూడా వర్షం ప్రభావం ఉంటే ఓవర్లను తగ్గించి మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంటుంది.
కనీసం ఐదు ఓవర్లు తప్పనిసరి:
ఫలితం రావాలంటే రెండు జట్లు కనీసం 5 ఓవర్లు ఆడాలి. అవసరమైతే డక్వర్త్-లూయిస్-స్టెర్న్ విధానాన్ని అమలు చేసి విజేతను నిర్ణయిస్తారు. దీంతో పూర్తిస్థాయి మ్యాచ్ జరగకపోయినా ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది.
మ్యాచ్ పూర్తిగా రద్దు అయితే ట్రోఫీ ఎవరికి?
ఒకవేళ ప్రధాన మ్యాచ్ రోజు రిజర్వ్ డే రెండింటిలోనూ ఆట జరగకపోతే ఐపీఎల్ నిబంధనలు అమలులోకి వస్తాయి. అప్పుడు లీగ్ దశ ముగిసే సమయానికి పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు నే ఛాంపియన్ గా ప్రకటిస్తారు.
ఆర్సీబీకి భారీ అడ్వాంటేజ్:
లీక్ దశ ముగిసే సమయానికి ఆర్సీబీ అత్యుత్తమ నెట్ రన్రేట్తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కాబట్టి మ్యాచ్ పూర్తిగా రద్దు అయితే ట్రోఫీ ఆర్సిబి ఖాతాలో పడే అవకాశం ఉంది. దీంతో బెంగుళూరు అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
వాతావరణం ఎలా ఉంది..?
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం గుజరాత్ లో ఫ్రీ మాన్సూన్ ప్రభావం కనిపించే అవకాశం ఉన్నప్పటికీ.. మ్యాచ్ జరిగే సమయానికి అహ్మదాబాద్ లో వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు సమాచారం. దీంతో అభిమానులు ఎలాంటి అంతరాయం లేకుండా ఫైనల్ మ్యాచ్ ని ఆస్వాదించే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి.


