జనగామ జిల్లాలో ఒకేసారి భారీగా తహసీల్దార్ల బదిలీలు చోటుచేసుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 13 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారులు వెంటనే కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు.
బదిలీ అయిన తహసీల్దార్లు మరియు వారి కొత్త పోస్టింగులు ఇలా ఉన్నాయి:
👉 డి. స్వప్న – కలెక్టర్ కార్యాలయం నుండి స్టేషన్ ఘనపూర్
👉 డి. వెంకటేశ్వర్లు – స్టేషన్ ఘనపూర్ నుండి కలెక్టర్ కార్యాలయం సూపరిండెంట్
👉 పి. శ్రీనివాసరెడ్డి – ఆర్డీఓ కార్యాలయం నుండి జాఫర్గడ్
👉 ఏ. ఆండాలు – కలెక్టర్ కార్యాలయం నుండి లింగాల ఘనపూర్
👉 ఎన్. చంద్రశేఖర్ రెడ్డి – కలెక్టర్ కార్యాలయం నుండి డిపిఏ ఆర్డీఓ కార్యాలయం
👉 పి. రవీందర్ – లింగాల ఘనపూర్ నుండి ఎస్డీసీ యూనిట్–1
👉 మోసిన్ – జనగామ నుండి తరిగొప్పుల
👉 ఎం. మహిపాల్ రెడ్డి – తరిగొప్పుల నుండి జనగామ
👉 బి. రాజేష్ – జాఫర్గడ్ నుండి రఘునాథపల్లి
👉 ఫణి కుమార్ – రఘునాథపల్లి నుండి కలెక్టర్ కార్యాలయం సూపరిండెంట్
👉 సిహెచ్. రజిత – ఎస్డీసీ యూనిట్–1 నుండి కలెక్టర్ కార్యాలయం సూపరిండెంట్
👉 చంద్రమోహన్ – కొడకండ్ల నుండి కలెక్టర్ కార్యాలయం సూపరిండెంట్
👉 అనిల్ బాబు – దేవరుప్పుల నుండి కొడకండ్ల


