హనుమకొండ తేదీ: 22-01-2026
చీఫ్ ప్లానింగ్ అధికారులతో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య సమీక్ష సమావేశం
పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులకు రూ.8 కోట్ల 30 లక్షలు మంజూరు
మూడు నెలల్లోపు పనులు ప్రారంభించాలి.. లేకపోతే రద్దు చేస్తాం
ప్రతి పని పురోగతి పబ్లిక్ డొమైన్లో ఉండాలి – ఎంపీ డా. కడియం కావ్య
వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు గురువారం హనుమకొండ కలెక్టరేట్లోని ఎంపీ ఛాంబర్లో చీఫ్ ప్లానింగ్ అధికారులతో ముఖ్యమైన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ..
• పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనుల కోసం ఎంపీ నిధుల నుంచి మొత్తం రూ. 8 కోట్ల 30 లక్షలు మంజూరు చేశామని తెలిపారు.
• అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ ఇచ్చిన తేదీ నుంచి మూడు నెలల లోపు పనులు తప్పనిసరిగా ప్రారంభించాలి.
• లేని పక్షంలో ఆ పనులను రద్దు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
• ఎంపీ నిధులతో చేపట్టే ప్రతి అభివృద్ధి పని పురోగతి వివరాలు పబ్లిక్ డొమైన్లో (ప్రజలకు అందుబాటులో) ఉండాలి.
• ఏవైనా టెక్నికల్ సమస్యలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
• ప్రజలకు నేరుగా మేలు చేసే కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయాలి.
• అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా నిర్దేశిత సమయంలోనే పూర్తి చేయాలని ఆదేశించారు.
• ప్రజా ప్రయోజనమే లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో అధికారులు ఇప్పటి వరకు చేపట్టిన పనుల వివరాలు, పెండింగ్ ప్రాజెక్టుల స్థితి, భవిష్యత్ ప్రణాళికలను ఎంపీకి వివరించారు.
సమావేశంలో చీఫ్ ప్లానింగ్ అధికారులు సత్యనారాయణ రెడ్డి, చంద్రకళ, కొట్యా నాయక్, బాబురావు, పంచాయతీరాజ్ అధికారులు ఆత్మా రామ్, రమేష్ బాబు, కిషన్, సతీష్ బాబు, ఆర్ అండ్ బి ఈఈ సురేష్ బాబు, టీజీఈడబ్ల్యూఐడిసీ అధికారి కిషన్, డిడబ్ల్యుఓ రాజమణి, మిషన్ భగీరథ అధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
౼ వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య


