HomePoliticsస్టేషన్ ఘనపూర్‌లో బిఆర్ఎస్‌పై కడియం శ్రీహరి ఘాటు విమర్శలు

స్టేషన్ ఘనపూర్‌లో బిఆర్ఎస్‌పై కడియం శ్రీహరి ఘాటు విమర్శలు

Published on

spot_img

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం, ఫిబ్రవరి 19, 2026:

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బిఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

బిఆర్ఎస్ నాయకులు అధికారాన్ని కుటుంబ హక్కుగా భావిస్తూ వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

విపరీతమైన ధోరణితో నీచమైన విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

అయితే ప్రజలు ఆ విమర్శలను పట్టించుకోవడం లేదని, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.

భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి, అక్రమాల కారణంగా ప్రజలు ఆ పార్టీకి దూరమవుతున్నారని వ్యాఖ్యానించారు. 2014కు ముందు కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు ఎంత? ప్రస్తుతం ఎంత ఉన్నాయో ప్రజల ముందు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

జాతిపిత అంశంపై కూడా కడియం శ్రీహరి స్పందిస్తూ, దేశానికి జాతిపిత ఒక్కరే ఉన్నారని, ఆయనే మహాత్మా గాంధీ అని స్పష్టం చేశారు.

జాతిపిత అని స్వయంగా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.

కేసుల విషయంలో మాట్లాడుతూ, కల్వకుంట్ల కుటుంబంలోని ప్రతి ఒక్కరూ వివిధ కేసుల్లో ఇరుక్కున్నారని ఆరోపించారు. తమపై కేసులు నమోదైతే తెలంగాణను అవమానిస్తున్నారని చెప్పడం తగదని ప్రశ్నించారు. “తెలంగాణ ఎవరి సొత్తు కాదు” అని వ్యాఖ్యానించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను ఎన్ని రోజులు రాజకీయాలకు వాడుకుంటారని ప్రశ్నించారు.

ప్రజలు తమ అహంకారం, మాట తీరు మార్చుకోకపోవడం వల్లే బిఆర్ఎస్‌కు దూరమవుతున్నారని అన్నారు.

అభివృద్ధే లక్ష్యం

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని కడియం శ్రీహరి తెలిపారు.

ఇటీవల ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలని సూచించారు.

ప్రజల నుండి రూపాయి ఆశించకుండా పారదర్శకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

“మనందరం కలిసి అవినీతి రహిత, అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా స్టేషన్ ఘనపూర్‌ను తీర్చిదిద్దుదాం” అని ఆయన అన్నారు.

Latest articles

బ్రేక్‌ఫాస్ట్‌ లో ఈ ఫుడ్స్ తింటే కడుపు నిండుగా.. ఆరోగ్యం పదిలం!

ఉదయం అల్పాహారం రోజంతా శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండే సమతుల్యమైన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఎక్కువసేపు ఎనర్జీగా ఉండొచ్చు.

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి
spot_img

Related Articles

కాంగ్రెస్ భూ స్కామ్‌లు, 22A దుర్వినియోగంపై BRS ధ్వజం

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ భూ అక్రమాలు మరియు 22A నిబంధనల దుర్వినియోగంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

కాంగ్రెస్, BRSలపై ఫైర్ అయిన బీజేపీ నేత రామచందర్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్, BRS పార్టీలు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి, వీధి నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, వారి వైఖరిని చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.

కొండా సురేఖను బీఆర్‌ఎస్‌లోకి రానివ్వం: జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖను బీఆర్‌ఎస్ పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వబోమని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.