మేడారం, కన్నేపల్లి ఆలయాల్లో సమ్మక్క-సారలమ్మలకు రేపు (బుధవారం) తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు.
మహాజాతర ప్రారంభమైన వారం రోజుల తర్వాత ఈ పండుగ జరుపుతారు.
పూజారులు ఆలయాలను శుద్ధి చేసి ధూపదీపాలు వెలిగించి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
తిరుగువారం పండుగ రోజున గిరిజన, గిరిజనేతర భక్తులు అమ్మవార్లను దర్శించి మొక్కులు చెల్లించుకుంటారు.
ఈ పండుగతో మహాజాతర పూజా కార్యక్రమాలు పూర్తికానున్నాయి.


