ములుగు జిల్లా, ఏటూరునాగారం మండలం, గంటలకుంట మరియు మామిడిగూడెం గ్రామాల్లో విద్యార్థులు మురుగునీటినే తాగునీరుగా వాడుతున్నారనే అంశంపై కథనాలు ప్రచురితమవ్వడంతో స్పందించిన మంత్రి సీతక్క వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మంత్రి ఆదేశాలతో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి దేవేందర్, వాటర్ ట్యాంకర్ల ద్వారా ఆ గ్రామాలకు తాగునీటి సరఫరాను ప్రారంభించారు.
నీటి కొరత లేకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని, అవసరమైతే మంత్రి తన సొంత ఖర్చులతో బోర్లు వేయించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.


