పాలిటిక్స్ అంటే ఎప్పుడు అరుపులేనా..? గొడవలేనా..? తగాదాలేనా..? విమర్శలేనా..? కాదు..
అప్పుడప్పుడు సరదాగా స్నేహపూర్వకంగా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మీట్ అవుతుంటారు. అలాంటి ఒక సీన్ ఇప్పుడు రిపీట్ అయింది. అదే తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు సెన్సేషన్ గా మారింది.
ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఉప్పు నిప్పుగా ఉండే సీనియర్ నేతలు సోమవారం సాయంత్రం ఆత్మీయంగా ఒక్కచోట చేరి మంచి-చెడు మాట్లాడుకున్నారు.
దీంతో ఈ న్యూస్ బిగ్ హాట్ టాపిక్ గా మారింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన క్యాంప్ ఆఫీసుల్లో స్పెషల్ గా కొంతమంది నేతలకు డిన్నర్ ఏర్పాటు చేశారు.
ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ హైలెట్ ఏంటంటే..ఈ డిన్నర్ కు దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ మొదటిసారి నాయిని ఇంటికి వచ్చారు.
కొండ సురేఖతోపాటు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కె ఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, డీసీసీ అధ్యక్షులు, కూడా చైర్మన్ ఇనగల వెంకట్రామిరెడ్డి , వరంగల్ అధ్యక్షుడు అయూబ్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి, మాజీ మేయర్ గుండు సుధారాణి తదితరులు ఈ డిన్నర్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నేతలు అందరూ ఒకరినిఒకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ కలిసి భోజనం చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.
అంతేకాదు విందు అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
ఇది చాలా స్నేహపూర్వకంగా జరిగిన మీటింగ్ అని ఇందులో వరంగల్ అభివృద్ధి గురించి చాలా అంశాలు మాట్లాడామని..వాటి గురించి చర్చించుకున్నామని ఆమె చెప్పుకు వచ్చారు.
దీంతో వరంగల్ పాలిటిక్స్ లో ఇప్పుడు కొండా సురేఖ పేరు అదేవిధంగా నాయిని రాజేందర్ రెడ్డి పేర్లు సెన్సేషన్ గా మరాయి.


