HomeLatest NewsRBI కొత్త రూల్..ఇక పై EMI కట్టకపోతే ఫోన్‌ లాక్‌?

RBI కొత్త రూల్..ఇక పై EMI కట్టకపోతే ఫోన్‌ లాక్‌?

Published on

spot_img

మొబైల్ ఫోన్ EMI కట్టకపోతే ఫోన్ లాక్ అయిపోతుందా? అంటే.. అవును అనే సమాధనమే చెప్పాలి.

డిఫాల్టర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.

మనకు తెలిసిందే దేశంలో మొబైల్ ఫోన్లు, టాబ్లెట్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువుగా EMI పై కొనుగోలు చేస్తుంటారు జనాలు.

రోజు రోజుకి అలా చేసే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో RBI కీలక ముసాయిదా నిబంధనలు విడుదల చేసింది.

రుణగ్రహీతలు EMI చెల్లించడంలో విఫలమైతే.. నిర్దిష్ట షరతులతో రుణదాతలు మొబైల్ లేదా టాబ్లెట్‌లోని కొన్ని ఫీచర్లను రిమోట్‌గా నిలిపివేయడానికి వీలు కల్పించేలా ఈ ప్రతిపాదనలు రూపొందించారు.

‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరణ ఆదేశాలు, 2026’ పేరుతో విడుదలైన ఈ నిబంధనలు అక్టోబర్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ కొత్త నిబంధనల ప్రకారం, రుణం 90 రోజులు బకాయిగా ఉన్నప్పుడే పరికరంపై పరిమితులు విధించవచ్చు.

అయితే, ముందుగా రుణగ్రహీతలకు దశలవారీగా నోటీసులు ఇవ్వడం తప్పనిసరి.

60 రోజుల తర్వాత మొదటి నోటీసు, అనంతరం మరో గడువుతో రెండో నోటీసు జారీ చేసిన తర్వాతే ఆంక్షలు అమలు చేయాలి. వినియోగదారుల స్పష్టమైన సమ్మతి ఉంటేనే ఈ విధానం వర్తిస్తుందని RBI ప్రత్యేకంగా తెలిపింది.

ఇంటర్నెట్ సేవలు, ఇన్‌కమింగ్ కాల్స్, అత్యవసర సేవలు, ప్రభుత్వ హెచ్చరికలను నిలిపివేయరాదని స్పష్టం చేసింది.

బకాయిలు చెల్లించిన గంటలోపే ఆంక్షలు తొలగించాలని, ఆలస్యం అయితే గంటకు రూ.250 పరిహారం చెల్లించాలని పేర్కొంది.

అలాగే రికవరీ ఏజెంట్ల బెదిరింపులు, వేధింపులపై కూడా కఠిన ఆంక్షలు విధించింది.

స్మార్ట్‌ఫోన్ లోన్లు తీసుకుని ఉద్దేశపూర్వకంగా EMI ఎగ్గొట్టే వారిపై నిఘా పెట్టేందుకే RBI ఈ సమగ్రమైన డ్రాఫ్ట్ మార్గదర్శకాలను విడుదల చేసింది.

అంతేకాకుండా కస్టమర్ల మొబైల్‌లో ఉన్న ఎలాంటి వ్యక్తిగత డేటాను బ్యాంకులు చూడటం లేదా నిల్వ చేయడం లేదా వాడుకోవడం లాంటివి పూర్తిగా నిషేధించింది.

దేశంలో 1.16 బిలియన్లకు పైగా మొబైల్ కనెక్షన్లు ఉండటంతో, ఈ కొత్త నిబంధనలు కోట్లాది వినియోగదారులపై ప్రభావం చూపే అవకాశముంది.

Latest articles

AI 80’s ఫోటో ట్రెండ్‌పై నిపుణుల హెచ్చరిక.. ఫోటోలు అప్‌లోడ్ చేసే ముందు జాగ్రత్త!

AI టూల్స్‌తో 1980ల నాటి ఫోటోల తరహాలో చిత్రాలను మార్చుకునే ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వ్యక్తిగత ఫోటోలను AI ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేసే ముందు ప్రైవసీ, డేటా భద్రతపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బిగ్ బాస్ హోస్టుల రెమ్యునరేషన్.. ఒక్కో సీజన్‌కు కోట్లలో పారితోషికం!

బిగ్ బాస్ షోకు హోస్టులుగా వ్యవహరించిన ప్రముఖ నటులు, సెలబ్రిటీలకు భారీగా పారితోషికం అందినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో సీజన్‌కు ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసుకోవాలంటే ఈ వివరాలు చూడాల్సిందే.

అభిమానం అంటే ఇదే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన పనికి ప్రశంసలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) సామాజిక బాధ్యతలో భాగంగా కీలక కార్యక్రమం చేపట్టింది. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై దేశవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది బాలికలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

నిద్రలో పదేపదే మేల్కొంటున్నారా? మీ శరీరం చెప్తుందే ఇదే..!

రాత్రిపూట నిద్రలో పదేపదే మెలకువ రావడానికి ఒత్తిడి, ఆందోళన, కెఫిన్, గది వాతావరణం వంటి కారణాలు ఉండొచ్చు. అయితే గురకతో పాటు శ్వాస ఆగడం, పగటిపూట అధిక నిద్రమత్తు ఉంటే స్లీప్ అప్నియా సంకేతాలు కావచ్చు.
spot_img

Related Articles

విద్యార్థుల ఖాతాల్లోనే నేరుగా ఫీజు రీయింబర్స్ మెంట్: శాసనసభలో సీఎం కీలక ప్రకటన

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ఎత్తివేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తెరదించారు.

AI 80’s ఫోటో ట్రెండ్‌పై నిపుణుల హెచ్చరిక.. ఫోటోలు అప్‌లోడ్ చేసే ముందు జాగ్రత్త!

AI టూల్స్‌తో 1980ల నాటి ఫోటోల తరహాలో చిత్రాలను మార్చుకునే ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వ్యక్తిగత ఫోటోలను AI ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేసే ముందు ప్రైవసీ, డేటా భద్రతపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మెహందీ కళాకారుల ఉద్యోగాలకు ఎసరు? వైరల్ AI వీడియోతో కొత్త భయం!

మెహందీ ఆర్టిస్టుల పనిని సులభతరం చేసేలా కనిపిస్తున్న ఓ మెషీన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా షేర్ చేసిన ఈ AI-generated వీడియోపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.