హన్మకొండ జిల్లా మడికొండ గ్రామ పరిధిలోని కనకదుర్గ కాలనీ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక ఐస్క్రీమ్ కంపెనీలో పనిచేస్తున్న రణవీర్ అనే వలస కూలీ, పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం అతివేగంగా వచ్చి అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రణవీర్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి, చికిత్స నిమిత్తం అతడిని ఎంజీఎం (MGM) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


