సాయి పల్లవి కి బ్యాడ్ లక్..రష్మిక మందన్నా గుడ్ లక్..:
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ భాషల్లో పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్లలో నటిస్తూ తన కెరీర్ను మరింత విస్తరించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆమెకు మరో కీలక అవకాశం దక్కబోతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
భారతరత్న, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బలక్ష్మి జీవిత కథ ఆధారంగా రూపొందించనున్న బయోపిక్లో ప్రధాన పాత్ర కోసం రష్మిక మందన్న పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ పాత్రకు సంబంధించి ఇటీవల ప్రత్యేక లుక్ టెస్ట్ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో రష్మిక కనిపించిన తీరు చిత్ర బృందాన్ని ఆకట్టుకుందని టాక్ వినిపిస్తోంది.
వాస్తవానికి ఈ పాత్ర కోసం గతంలో సాయి పల్లవి, రుక్మిణి వసంత్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి. ముఖ్యంగా సాయి పల్లవి ఈ పాత్రకు తగిన విధంగా కర్ణాటక సంగీతంపై ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. అయితే తాజా సమాచారం ప్రకారం చిత్ర యూనిట్ రష్మిక వైపు మొగ్గు చూపుతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఈ బయోపిక్కు ‘జెర్సీ’ చిత్రంతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించే అవకాశముందని ప్రచారం సాగుతోంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. భారతీయ సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిన ఎం.ఎస్. సుబ్బలక్ష్మి జీవితాన్ని వెండితెరపై ఎలా ఆవిష్కరిస్తారన్న దానిపై సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తోంది.


