HomeWarangal Newsమహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి | కడియం కావ్య

మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి | కడియం కావ్య

Published on

spot_img

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం: తేదీ:19.01.2026

మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి…..

ప్రతీ పని, ప్రతీ పథకానికి మహిళల పేరు మీదనే అమలు….

కోటి మంది మహిళలకు ఒకే రకమైన చీరలు…..

18ఏళ్ళు నిండిన ప్రతీ మహిళకు చీరలు పంపిణి చేయాలి…..

మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత

మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం అభివృద్ధి చెందుతుంది

Dr Kadiyam Kavya
కడియం కావ్య

మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ….మహిళల ఆత్మగౌరవాన్ని నిలిపేలా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ నిర్వహిస్తోందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు అన్నారు.

స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని ఎస్ కన్వెన్షన్ లో నిర్వహించిన స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరా క్రాంతి పథకం కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణి కార్యక్రమానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు, జిల్లా అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు మాట్లాడుతూ…..

మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

Dr Kadiyam Kavya
కడియం కావ్య

అందులో భాగంగానే మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ పంపులు మరియు వ్యవసాయ రంగాలలో మహిళలు ముఖ్యమైన పాత్ర పోషించే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని పేర్కొన్నారు.

మహిళల ఆత్మ గౌరవాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈసారి నాణ్యమైన చీరలను అందిస్తుందన్నారు. మహిళల సామాజిక–ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని మాడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు మన ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు కృషి చేస్తున్నారని అన్నారు.

Public Meeting Dr Kadiyam Kavya
కడియం కావ్య

నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి ఎం కావాలో, ఎం చేయాలో కూడా తెలుసని అన్నారు.

గతంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం పేరు చెప్పుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవాని కానీ ఇప్పుడు తల ఎత్తుకొని మాది స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం అని చెప్పుకునే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తున్నాడని తెలిపారు.

Woman in Meeting
మహిళలు

మహిళలు ఆత్మగౌరవంతో ఉండాలని ఇక్కడే మహిళా కమ్యూనిటీ హల్ మంజూరు చేయడం అందులో నన్ను బాగాస్వామిని చేయడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు.

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి 1400కోట్ల నిధులు తీసుకువచ్చి తన మార్క్ అభివృద్ధి పనులు చేపడుతున్నారని కొనియాడారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ…

మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద పీట వేస్తున్నారని అన్నారు.

ఒకవైపు వ్యవసాయానికి అండగా ఉంటూనే అనేక రకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ మహిళా సంక్షేమానికి కొత్త కార్యక్రమాలు కొత్త పథకాలు తీసుకువచ్చి అమలు చేస్తూ మహిళలను ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారాని తెలిపారు.

Kadiyam Srihari
కడియం శ్రీహరి

ఈ సందర్భంగా ఈ రెండు సంవత్సరాల కాలంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణి, ఇందిరమ్మ ఇల్లు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఒక్క ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చాగల్, శివునిపల్లి, ఘనపూర్ గ్రామాలకు ఇప్పటికే 300 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసానని మళ్ళీ వచ్చే రెండవ విడతలో వచ్చే 3500ఇళ్లలో ఒక్క ఘనపూర్ మున్సిపాలిటీకే 500ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

మహిళలు కలిస్తే సాధించెలేనిది ఏది లేదని అన్నారు. మీకు ఎప్పుడూ ఎలాంటి సహాయం కావాలన్న నా పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.

మహిళా సంఘాల సభ్యులందరు కలిసి ఒక శక్తి ఎదగాలదని ఆకాంక్షంచారు. ఘనపూర్ మున్సిపాలిటీని రుణాలు ఇవ్వడంలో, రికవరీ చేయడంలో మొదటి స్థానంలో నిలపాలని అన్నారు.

మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఘనపూర్ మున్సిపాలిటీ కేంద్రంలో మహిళా కమ్యూనిటీ హల్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

ఘనపూర్ ను మున్సిపాలిటీ గా చేసుకున్నాం, మున్సిపాలిటీ అభివృద్ధికి 50కోట్ల నిధులు కూడా తెచ్చుకున్నామని తెలిపారు. ఒక ఏడాదిలో 50కోట్ల పనులు పూర్తి చేసి స్టేషన్ ఘనపూర్ రూపు రేఖలు మార్చుతానని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, ఆర్డివో వెంకన్న, డీఆర్ డివో వాసంతి, మెప్మా పీడీ హర్షవర్ధన్, టీఎంసి వాణి శ్రీ, తహసీల్దార్, మహిళా సంఘాల అధ్యక్షులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Latest articles

ఐఫోన్‌లో కొత్త శకం.. ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది!

యాపిల్ ఎట్టకేలకు ఫోల్డబుల్ ఐఫోన్‌ను లాంచ్ చేసి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. కొత్త డిజైన్, ఫోల్డింగ్ డిస్‌ప్లే, అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ ఐఫోన్‌పై టెక్ ప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

నందు బిగ్ బాస్‌లోకి వస్తే..నాగార్జునకు కొత్త తలనొప్పి తప్పదా?

బిగ్ బాస్ తెలుగు 10లో నందు ఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నందు హౌస్‌లోకి వస్తే హోస్ట్ నాగార్జునకు కొత్త తలనొప్పులు తప్పవా? ఆమెకు సంబంధించిన వివాదాలు షోపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు: నేడు 22A నిషేధిత భూములపై చర్చ

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నాలుగో రోజు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో ప్రధానంగా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోని సెక్షన్ 22ఆ అంశంపై ఉభయ సభల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘమైన, వాడీవేడి చర్చ జరగనుంది.
spot_img

Related Articles

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఇసుక ట్రాక్టర్ – ఆటో ఢీ: ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పర్వతగిరి మండల పరిధిలోని అన్నారం గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక ఇసుక ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

హనుమకొండలో భారీ అగ్నిప్రమాదం: హోటల్ యజమాని దుర్మరణం, భార్య పరిస్థితి విషమం

హనుమకొండ జిల్లా పరిధిలోని అదాలత్ జంక్షన్ వద్ద ఉన్న ప్రముఖ 'లింగాల కేదారి హోటల్'లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.