హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో విద్యుత్ సంస్కరణలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల విడుదల, ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణపై చర్చించనున్నారు. అలాగే ఇందిరమ్మ కుటుంబ బీమా, రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్లు వంటి సంక్షేమ పథకాలపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఇక జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణ, పంట మార్పిడి ప్రణాళికపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. ఈ అంశాలపై సమగ్రంగా చర్చించి అవసరమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.


