తీగారం గ్రామంలోని దుర్గమ్మ ఆలయంలో తెల్లవారుజామున చోరీ ఘటన చోటుచేసుకుంది. పాలకుర్తి మండలం పరిధిలో ఉన్న ఈ గ్రామంలో దొంగలు ఆలయంలోకి చొరబడి హుండీని ఎత్తుకెళ్లారు.
దొంగలు హుండీని గ్రామ చెరువు మట్టడి సమీపంలో పడవేసినట్లు సమాచారం. హుండీలో సుమారు రూ.30,000 నగదు ఉన్నట్లు ఆలయ పరిరక్షణ బాధ్యతలు చూసుకునే ముదిరాజ్ సంఘ సభ్యులు తెలిపారు.
ఇదే ఆలయంలో ఇంతకుముందు కూడా రెండుసార్లు చోరీ జరిగినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. వరుస చోరీలతో ఆందోళన వ్యక్తం చేస్తున్న వారు గ్రామంలో పోలీస్ గస్తీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


