HomeWarangal Newsఈ రోజు ముఖ్యాంశాలు: 26.11.2025

ఈ రోజు ముఖ్యాంశాలు: 26.11.2025

Published on

spot_img

జనగామ జిల్లా కలెక్టరేట్‌లో వరంగల్ MP కడియం కావ్య అధ్యక్షతన దిశా సమావేశం. “పేదలకు సేవ చేయడమే లక్ష్యం” అని ప్రకటించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ రిజ్వాన్ బాషా పాల్గొన్నారు.

ఈ రోజు హనుమకొండకు రానున్న కల్వకుంట్ల తారకరామారావు (KTR)

వరంగల్ కలెక్టర్ Dr సత్య శారద ఎమ్మెల్యే శ్రీ నాగరాజు గారితో కలసి పర్వతగిరి, ఐనవోలు, హాసన్పపర్తి SHGలకు వడ్డీలేని రుణ చెక్కులు, మోంథా తుఫాన్ బాధితులకు రేషన్ బియ్యం పంపిణీ.

రీటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (REWA) వరంగల్ జిల్లా కమిటీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి పెండింగ్ డ్యూస్ క్లియర్ చేయాలని డిమాండ్.

మేయర్ గుండు సుధారాణి, హన్మకొండ అంబేడ్కర్ భవన్, పిస్తా హౌస్, లాండ్రో మార్ట్ పరిశీలించారు. నాలాల్లో సిల్ట్ తొలగించాలని ఆదేశాలు.

సంగెం మండలం అశలపల్లి గ్రామంలో SC మహిళకు రిజర్వ్. ఒక్క SC మహిళా వోటర్ (మల్లమ్మ) ఉన్నందున, ఆమె సర్పంచ్.

వాన్జరపల్లి గ్రామంలో ST జనరల్‌కు రిజర్వ్, కానీ ఒక్క ST వోటర్ లేరు – వివాదం ఏర్పడింది.

తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) లో పూర్తిగా విలీనం చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న NPDCL (ఉత్తర తెలంగాణ) మరియు SPDCL (దక్షిణ తెలంగాణ) రెండు విద్యుత్ పంపిణీ సంస్థలతో పాటు, కొత్తగా మూడో డిస్కమ్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. మూడు దఫాల్లో పోలింగ్ 11 డిసెంబర్‌ – తొలి విడత, 14 డిసెంబర్‌ – రెండో విడత, 17 డిసెంబర్‌ – మూడో విడత. రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే ఎన్నికల కోడ్ అమలు.

ములుగు జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్. జగ్గన్నపేట గ్రామంలో అంతర్జాతీయ నాణ్యత కలిగిన స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు రూ. 200తో పడిపోయాయి. 22 క్యారట్ గోల్డ్ గ్రాముకు రూ. 7,450. వెండి రేటు కూడా డౌన్.

Latest articles

ఐఫోన్‌లో కొత్త శకం.. ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది!

యాపిల్ ఎట్టకేలకు ఫోల్డబుల్ ఐఫోన్‌ను లాంచ్ చేసి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. కొత్త డిజైన్, ఫోల్డింగ్ డిస్‌ప్లే, అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ ఐఫోన్‌పై టెక్ ప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

నందు బిగ్ బాస్‌లోకి వస్తే..నాగార్జునకు కొత్త తలనొప్పి తప్పదా?

బిగ్ బాస్ తెలుగు 10లో నందు ఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నందు హౌస్‌లోకి వస్తే హోస్ట్ నాగార్జునకు కొత్త తలనొప్పులు తప్పవా? ఆమెకు సంబంధించిన వివాదాలు షోపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు: నేడు 22A నిషేధిత భూములపై చర్చ

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నాలుగో రోజు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో ప్రధానంగా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోని సెక్షన్ 22ఆ అంశంపై ఉభయ సభల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘమైన, వాడీవేడి చర్చ జరగనుంది.
spot_img

Related Articles

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఇసుక ట్రాక్టర్ – ఆటో ఢీ: ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పర్వతగిరి మండల పరిధిలోని అన్నారం గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక ఇసుక ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

హనుమకొండలో భారీ అగ్నిప్రమాదం: హోటల్ యజమాని దుర్మరణం, భార్య పరిస్థితి విషమం

హనుమకొండ జిల్లా పరిధిలోని అదాలత్ జంక్షన్ వద్ద ఉన్న ప్రముఖ 'లింగాల కేదారి హోటల్'లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.