హన్మకొండలోని రెడ్డి కాలనీలో ఒక చిన్నపాటి అజాగ్రత్త పెద్ద ప్రమాదానికి దారితీసింది. ఇనుప పైపుతో వస్తువులను తీసే క్రమంలో విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.
రోడ్ నంబర్-2లో అబ్దుల్ రెహ్మాన్, ఎస్డీ ఫాజన్ (13) అనే ఇద్దరు బాలురు గిన్నెలు తోమే స్క్రబ్బర్ను ఇనుప పైపుతో తీస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తగిలాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించడంతో 108 ఈఎంటీ మమత, పైలట్ శివకుమార్ గాయపడిన వారిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


