రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన సీనియర్ కాంగ్రెస్ నాయకులు వేం నరేందర్ రెడ్డి కి నేడు హనుమకొండలో ఘన సన్మాన కార్యక్రమం జరగనుంది.
ఈ సన్మాన సభను ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. హనుమకొండలోని హంటర్ రోడ్డులో ఉన్న ‘D’ కన్వెన్షన్ హాల్ వేదికగా ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
ఈ సన్మాన సభకు రాష్ట్ర మంత్రులు సీతక్క మరియు కొండా సురేఖ హాజరుకానున్నారు. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాల్గొని, రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపనున్నారు.


