రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి గారితో తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జెఎసి (JAC) ప్రతినిధులు భేటీ అయ్యారు.
విద్యుత్ రంగానికి సంబంధించిన వివిధ సమస్యలపై చర్చించడానికి పవర్ ఎంప్లాయిస్ జెఎసి బాధ్యులు నరేందర్ రెడ్డిని కలిశారు. విద్యుత్ అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించేలా కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జెఎసి చైర్మన్ సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్ రావు, సెక్రటరీ జనరల్ ఈ. శ్రీధర్, కో-కన్వీనర్ తాజుద్దీన్ బాబా, సెక్రటరీ జనరల్ సదానందం మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.


