HomeWarangal Newsవరంగల్ GRP పోలీసుల తక్షణ స్పందన: ప్రయాణికురాలి హ్యాండ్‌బ్యాగ్ క్షేమంగా అప్పగింత

వరంగల్ GRP పోలీసుల తక్షణ స్పందన: ప్రయాణికురాలి హ్యాండ్‌బ్యాగ్ క్షేమంగా అప్పగింత

Published on

spot_img

వరంగల్: రైలు ప్రయాణంలో పొరపాటున జారిపడిపోయిన విలువైన బ్యాగును వరంగల్ GRP (గవర్నమెంట్ రైల్వే పోలీస్) సిబ్బంది అతి తక్కువ సమయంలోనే వెతికి పట్టుకుని బాధితురాలికి అందజేశారు.

ఈ రోజు (07-05-2026) ఉదయం గుడివాడ నివాసి అయిన గెల్లి శ్రీదేవి (భర్త సురేంద్రనాథ్) బీదర్ ఎక్స్‌ప్రెస్ (Tr.No 12749) లో ప్రయాణిస్తుండగా, అర్ధరాత్రి సుమారు 02:00 గంటల సమయంలో చింతలపల్లి – వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య ఆమె హ్యాండ్‌బ్యాగ్ రైలులో నుండి జారి పడిపోయింది. ఒక ఒప్పో (Oppo) మొబైల్, ₹10,000 నగదు మరియు ఇతర ముఖ్యమైన వస్తువులు బ్యాగులో ఉన్నాయి. వాటి విలువ సుమారు ₹40,000 పైచిలుకు.

బాధితురాలు వరంగల్ రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, IRP-వరంగల్ శ్రీ పి. సురేందర్ గారి ఆదేశాల మేరకు పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు.

​RHC కె. భాస్కర్ పర్యవేక్షణలో ఆన్-డ్యూటీ కానిస్టేబుళ్లు ఎండీ. నయీం పాషా మరియు ఎస్.కే. పాషాలు రైల్వే ట్రాక్ వెంట గాలింపు చేపట్టారు.

​వరంగల్ స్టేషన్ నుండి ధర్మారం గేటు వైపు సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాక్ వెతకగా, ఉదయం 07:00 గంటల ప్రాంతంలో సిమెంట్ కలర్ హ్యాండ్‌బ్యాగ్ లభ్యమైంది.

దొరికిన బ్యాగును మరియు అందులోని వస్తువులను పోలీసులు నిర్ధారించుకుని, బాధితురాలు గెల్లి శ్రీదేవికి సురక్షితంగా అప్పగించారు. సకాలంలో స్పందించి తన పోగొట్టుకున్న సొత్తును తిరిగి అప్పగించిన వరంగల్ GRP పోలీసులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

​సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు అభినందించారు.

Latest articles

ఐఫోన్‌లో కొత్త శకం.. ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది!

యాపిల్ ఎట్టకేలకు ఫోల్డబుల్ ఐఫోన్‌ను లాంచ్ చేసి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. కొత్త డిజైన్, ఫోల్డింగ్ డిస్‌ప్లే, అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ ఐఫోన్‌పై టెక్ ప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

నందు బిగ్ బాస్‌లోకి వస్తే..నాగార్జునకు కొత్త తలనొప్పి తప్పదా?

బిగ్ బాస్ తెలుగు 10లో నందు ఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నందు హౌస్‌లోకి వస్తే హోస్ట్ నాగార్జునకు కొత్త తలనొప్పులు తప్పవా? ఆమెకు సంబంధించిన వివాదాలు షోపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు: నేడు 22A నిషేధిత భూములపై చర్చ

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నాలుగో రోజు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో ప్రధానంగా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోని సెక్షన్ 22ఆ అంశంపై ఉభయ సభల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘమైన, వాడీవేడి చర్చ జరగనుంది.
spot_img

Related Articles

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఇసుక ట్రాక్టర్ – ఆటో ఢీ: ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పర్వతగిరి మండల పరిధిలోని అన్నారం గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక ఇసుక ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

హనుమకొండలో భారీ అగ్నిప్రమాదం: హోటల్ యజమాని దుర్మరణం, భార్య పరిస్థితి విషమం

హనుమకొండ జిల్లా పరిధిలోని అదాలత్ జంక్షన్ వద్ద ఉన్న ప్రముఖ 'లింగాల కేదారి హోటల్'లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.